దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్య‌ర్ కు షాకిచ్చిన రుతురాజ్ గైక్వాడ్- ఇండియా సీ సూప‌ర్ విక్ట‌రీ

First Published Sep 8, 2024, 10:13 AM IST

Duleep Trophy : దులీప్ ట్రోఫీలో ఇండియా సీ విజ‌యంతో ప్రారంభించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా డీ జట్టుపై విజయం అందుకుంది. మనవ్‌ సుతార్‌ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టారు. శ్రేయాస్ అయ్యర్ కు రుతురాజ్ గైక్వాడ్ టీమ్ షాకిచ్చింది.    
 

Shreyas Iyer, Ruturaj Gaikwad, Duleep Trophy

Duleep Trophy : శ్రేయాస్ అయ్యర్ కు రుతురాజ్ గైక్వాడ్ బిగ్ షాకిచ్చాడు. దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా భారత్-డీతో జరిగిన తొలి మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఇండియా-సీ విజయం సాధించింది. అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా సీ జ‌ట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

మూడు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ లో రెండో రోజు నుంచి టర్న్ అండ్ బౌన్స్ ఇవ్వడం ప్రారంభించిన పిచ్ పై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. శ్రేయాస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డారు. ఆ త‌ర్వాత కుదురుకున్నారు.

Duleep Trophy 2024

భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తన దేశవాళీ సీజన్‌ను దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌లో చురుకైన ఫిఫ్టీతో ప్రారంభించాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్ అత్యుత్తమ ప్రయత్నం చేసినప్పటికీ, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఇండియా సీనీ ఇండియా డీ జ‌ట్టు ఓడించలేకపోయింది.

బౌలర్లు ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మానవ్ సుతార్, హర్షిత్ రాణా, విజయ్ కుమార్ వైషక్ బాల్ తో సూప‌ర్ షో చూపించారు. ఇండియా సీ జట్టులో ఆల్‌రౌండర్‌ మనవ్‌ సుతార్‌ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.  

Latest Videos


Duleep Trophy 2024

మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌ కీలకమైన సమయంలో 19 పరుగులతో ఆల్‌రౌండ్‌ షో ప్రదర్శించిన మనవ్‌ సుతార్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు.

ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌లోని ప్రధాన మైదానంలో శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 206/8తో ప్రారంభించిన ఇండియా డీ జట్టు మరో 30 పరుగులు జోడించి మిగితా రెండు వికెట్లు కోల్పోయింది. 

Duleep Trophy 2024

మొదటి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న అక్షర్‌ పటేల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. హర్షిత్‌రాణా 12 పరుగులు చేశారు. ఇండియా సీ బౌలర్లలో మనవ్‌ సుతార్‌ 7 వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం కారణంగా ఇండియా సీ జట్టు  విజయలక్ష్యం 233 పరుగులు.

మొదటి ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడిన ఇండియా సీ జట్టు సభ్యులు రెండో ఇన్నింగ్స్‌లో సమష్టిగా రాణించారు. ఓపెనర్లు రుతురాజ్, సాయిసుదర్శన్‌ మొదటి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Duleep Trophy 2024

రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 46, సాయిసుదర్శన్‌ 5 ఫోర్లతో 22 పరుగులు చేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్యన్‌ జుయాల్‌ 47(3 ఫోర్లు, ఒక సిక్సర్‌), ఐపీఎల్‌ స్టార్‌ ఆటగాడు 77 బంతుల్లో 6 బౌండరీలు, సిక్సర్‌ సహాయంతో 44 పరుగులు చేశాడు.

వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పోరెల్‌ 35(నాటౌట్‌), ఇతనికి తోడుగా ఆల్‌రౌండర్‌ మనవ్‌ సుతార్‌ 19 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఇండియా డీ బౌలర్లలో సరాన్ష్‌ జైన్‌ 4, అర్ష్‌దీప్‌ సింగ్‌ , అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.
 
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ మానవ్‌ సుతార్ నిలిచాడు.  ఏసీఏ త్రీమెన్‌ కమిటీ మెంబర్, ఆర్డీటీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ ప్లేయర్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డును అందించారు. 

click me!