Duleep Trophy 2024 : ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ తో దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభం అయింది. ఈ సారి బీసీసీఐ ఇండియా ఏ, ఇండియా బీ, ఇండియా సీ, ఇండియా డీ అనే నాలుగు జట్లను ప్రకటించి దులీప్ ట్రోఫీని నిర్వహిస్తోంది.
సెప్టెంబరు 5 నుండి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో బెంగళూరు వేదికగా ఇండియా ఏ-ఇండియా బీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 19 ఏళ్ల యంగ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇండియా బీ జట్టు తరఫున దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగిన యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో అండర్ 19 ప్రపంచ కప్ తర్వాత జరుగుతున్న దులీప్ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన 181 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ముషీర్ ఖాన్ తో పాటు ఇదివరకు మరికొంత మంది క్రికెటర్లు వారి దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీలు, డబుల్ సెంచరీలు కూడా చేసారు. దులీఫ్ ట్రోఫీలో అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితా ఇలా ఉంది