RRvsKKR: విరాట్‌ పదేళ్లపాటు అది చెయ్యమన్నాడు... - సంజూ శాంసన్...

First Published Sep 30, 2020, 7:21 PM IST

IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్. వరుసగా రెండు అద్భుత హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్, తన ప్రదర్శనతో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. తన ఆటతీరులో మార్పు రావడానికి విరాట్ కోహ్లీయే కారణమంటున్నాడు సంజూ.
 

‘టీమిండియాకు ఆడడం ఓ అదృష్టం. నాకు ఆ అవకాశం వచ్చినప్పుడు జిమ్‌లో విరాట్‌ను కలిసాను.
undefined
నాలాంటి చాలామందికి రోల్ మోడల్‌ అతను. కోహ్లీని కలిసినప్పుడు అడగాలని అనుకున్న ప్రశ్నలన్నీ జిమ్‌లో అడిగేశా.
undefined
ఇంకా 10 ఏళ్లు క్రికెట్ ఆడతానని కోహ్లీతో చెప్పాను. అయితే ఈ పదేళ్ల జీవితం మొత్తం క్రికెట్‌కి అంకితం ఇవ్వమని చెప్పాడు కోహ్లీ.
undefined
ఆ మాట విన్న తర్వాత ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం కోసం ఫుడ్‌లో చాలా మార్పులు చేశా.
undefined
నాకు ఎంతోఇష్టమైన కేరళ ట్రెడిషనల్ఫుడ్ కూడా వదిలేశాను...
undefined
మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను...ఇది సక్సెస్ సీక్రెట్’ అన్నాడు సంజూ శాంసన్.
undefined
ధోనీలా ఆడడం ఇంకెవ్వరి వల్ల కాదని తెలుసుకున్నానని చెప్పిన సంజూ, ఎవ్వరినీ అనుకరించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
undefined
ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, సంజూ శాంసన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
undefined
ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో పంత్ విఫలం కాగా, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు.
undefined
వరుసగా రెండు మ్యాచుల్లో రెండు అద్భుతమైన హాఫ్ సెంచరీలు చేశాడు సంజూ శాంసన్.
undefined
click me!