ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా ముగిసిన తొలి టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యం. టీ20 జట్టుకు ఎంపికైన భువనేశ్వర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హార్ధిక్ పాండ్యా.. ఇలా ఒక్కరని కాదు.. నిన్నటి మ్యాచ్ లో ఒక్క అక్షర్ పటేల్ తప్ప బౌలింగ్ వేసిన ఐదుగురు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.