క్వారంటైన్లో రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాలో మొదటి రోజు ఫోటో షేర్ చేసి...
First Published Dec 18, 2020, 1:09 PM ISTరోహిత్ శర్మ... ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడి, కోలుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు. అక్టోబర్ 18న ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఫిట్గా ఉన్నాడని బీసీసీఐ అప్రూవల్ పొందడానికి డిసెంబర్ 12దాకా వేచి చూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఓ రేంజ్ హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు రోహిత్ ఆస్ట్రేలియా చేరడంతో ఈ డ్రామాకి ముగింపు కార్డు పడుతుందని భావిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.