వాళ్లు చేసిన పనివల్ల, ఇషాన్ కిషన్‌ చాలా పెద్ద గొడవపడ్డాడు, చివరికి... రోహిత్ శర్మ కామెంట్...

First Published May 28, 2021, 1:13 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా కొంత ప్లేయర్లతో రోహిత్ శర్మకి ఓ స్పెషల్ బాండింగ్ ఉంటుంది. తనకంటూ ఓ సెపరేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నాడు రోహిత్. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఒకడు.

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ఇషాన్ కిషన్, ఓసారి తన టీమ్‌మేట్స్ చేసిన చిలిపి పని వల్ల ఓ గొడవలో ఇరుక్కున్నాడని తెలిపాడు రోహిత్ శర్మ...
undefined
‘ముంబై ఇండియన్స్ ప్లేయర్లు, కివీస్ క్రికెటర్ షేన్ బాండ్‌కి ఫ్రాంక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అతనికి ముంబై ట్రైయినర్ పాల్ చాంప్‌మన్ కూడా తోడైతే వాళ్లు చేసే చిలిపి పనుల గురించి చెప్పలేం..
undefined
ఓసారి వాళ్లు లాంజ్‌లో ఉన్న ఓ టెలిఫోన్‌‌ వైర్ పీకి, ఇషాన్ కిషన్‌ బ్యాగులో పడేశారు. ఈ విషయం కిషన్‌కి తెలీదు. సెక్యూరిటీ చెక్ దగ్గర ఇషాన్ కిషన్‌ బ్యాగుని చెక్ చేస్తే టెలిఫోన్ కనిపించింది.
undefined
‘లాంజ్‌లో ఉన్ టెలిఫోన్ దొంగిలిస్తున్నావా?’ అంటూ సెక్యూరిటీ, ఇషాన్ కిషన్‌ను ప్రశ్నించారు. ‘నా దగ్గర రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. నేనెందుకు ఈ ఫోన్ దొంగిలిస్తా? ఇది నా బ్యాగులోకి వచ్చిందో కూడా నాకు తెలీదు’ అంటూ సమాధానం ఇచ్చాడు ఇషాన్ కిషన్.
undefined
అయితే సెక్యూరిటీ అధికారులు మాత్రం అతన్ని నమ్మలేదు. ‘హోటల్ సామాను దొంగిలించడం చాలా పెద్ద నేరం...’ అంటూ అది, ఇది ఏదేదో అనడం మొదలెట్టారు. ఇషాన్ కిషన్‌కి ఏం జరుగుతుందో, ఏం చేయాలో అర్థం కాలేదు.
undefined
అయితే ఆ తర్వాత తెలిసిందేంటంటే... ఆ సెక్యూరిటీ సిబ్బందితో కూడా కలిసి షేన్ బాండ్, పాల్ చాంప్‌మన్ ఈ ఫ్రాంక్ చేశారని’ అంటూ వివరించాడు రోహిత్ శర్మ.
undefined
ఐపీఎల్ 2020 సీజన్ పర్ఫామెన్స్ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్, శ్రీలంకలో పర్యటించే టీ20, వన్డే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగు మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్‌, పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో అతన్ని తుదిజట్టు నుంచి తప్పించి, వేరే ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ.
undefined
రెండు, మూడు మ్యాచుల్లో ఫెయిల్ అవ్వగానే ఇషాన్ కిషన్ లాంటి యంగ్ ప్లేయర్లను పక్కనబెట్టడంపై ఫ్యాన్స్, రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
undefined
click me!