2010లో నాగ్పూర్లో దక్షిణాఫ్రికాపై టెస్టు డెబ్యూ అవకాశం వచ్చిందనగా, టాస్కు ముందు వార్మప్ సమయంలో గాయపడ్డాడు రోహిత్. ఆ తర్వాత 2013 నవంబర్ 7న వెస్టిండీస్తో టెస్టు డెబ్యూ చేశారు. ఇది సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్ కాగా, రోహిత్ తన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే 177 పరుగుల సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన టెస్ట్ కెరీర్ను సెంచరీతో ప్రారంభించాడు.
"ఇంతకాలం ఎదురుచూసిన తర్వాత ఇంత గొప్ప స్థాయిలో అరంగేట్రం చేయడం మరిచిపోలేనిది" అని రోహిత్ ఆ మ్యాచ్ అనంతరం అన్నాడు. అప్పట్లో రవిచంద్రన్ అశ్విన్ (124) తో కలిసి 280 పరుగుల భాగస్వామ్యం చేసి టీమిండియాను కష్టస్థితిలోంచి బయటపడేశారు.