రోహిత్ శర్మ తండ్రికి కరోనా? అందుకే ‘హిట్ మ్యాన్’ ఆస్ట్రేలియా వెళ్లకుండా ఆగిపోయాడా...

First Published Nov 26, 2020, 1:06 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యంత చర్చనీయమైన అంశం రోహిత్ శర్మ గాయం. రోహిత్ శర్మ గాయం గురించి ఓ వైపు బీసీసీఐ, మరోవైపు ముంబై ఇండియన్స్ ఒక్కోలా చెప్పడం వాటిని పట్టించుకోకుండా హిట్ మ్యాన్ బరిలో దిగి మూడు మ్యాచులు ఆడడం చాలా పెద్ద చర్చకు దారి తీసింది. 

ఐపీఎల్ తర్వాత ఆసీస్ టూర్‌కి వెళ్లకుండా రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి రావడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. అయితే రోహిత్ ఇలా చేయడానికి వేరే రీజన్ ఉందంటున్నారు కొందరు నెటిజన్లు.
undefined
ఐపీఎల్‌లో గాయపడిన వృద్ధిమాన్ సాహా కూడా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకి పయనమయ్యాడు. రోహిత్ శర్మ మాత్రం యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.
undefined
14 రోజుల క్వారంటైన్ నిబంధన తెలిసి కూడా రోహిత్ శర్మను ఆస్ట్రేలియాకు పంపించకుండా, స్వదేశానికి ఎందుకు తీసుకువచ్చారంటూ బీసీసీఐ అధికారులకు ప్రశ్న ఎదురైంది... పక్షపాత ధోరణితో వ్యవహారిస్తున్నారంటూ ట్రోలింగ్ కూడా వచ్చింది.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలో దిగిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అందులోనూ మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
undefined
గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే జట్టుకు దూరమైన ఇషాంత్ శర్మ, స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఈ కారణంగా ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయాడు.
undefined
అయితే ఫైనల్ మ్యాచ్ వరకూ యూఏఈలోనే ఉన్న రోహిత్ శర్మ, టెస్టు టీమ్‌కి సెలక్ట్ అయినా భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లలేదు.
undefined
టెస్టులకు ఎంపికైన సాహా, సిరాజ్ వంటివాళ్లను ఆస్ట్రేలియా తీసుకెళ్లినప్పుడు, రోహిత్ శర్మను కూడా ఆసీస్ తీసుకెళ్లి చికిత్స ఇప్పించవచ్చుగా అని ప్రశ్నిస్తూ ట్రోల్ చేశారు నెటిజన్లు.
undefined
దీనికి సమాధానం చెప్పిన బీసీసీఐ... ‘రోహిత్‌ను ఫిట్‌నెస్ సాధించడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లమని మేం చెప్పలేదు... ఆ నిర్ణయం పూర్తిగా అతనిదే’ అంటూ స్పష్టత నిచ్చింది.
undefined
బీసీసీఐ వివరణతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లకుండా స్వదేశం రావడానికి కారణం అతని తండ్రి గురుక్రాంత్ శర్మకి కరోనా సోకడమేనట.
undefined
రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మకు కోవిద్ పాజిటివ్ రావడంతో ఆయనకి దగ్గరగా ఉంటూ మనోధైర్యం నింపేందుకే ‘హిట్ మ్యాన్’ యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడని సమాచారం...
undefined
‘చాలామంది రోహిత్ శర్మకు టెస్టు సిరీస్ ఆడడం ఇష్టం లేదని, అందుకే ఆస్ట్రేలియాకి వెళ్లకుండా భారతదేశానికి తిరిగి వచ్చాడని అంటున్నారు. అయితే అదేగనుక నిజమైన రోహిత్ శర్మ ఎన్‌సీఏలో శిక్షణ తీసుకోడు. భార్యతో కలిసి జాలీగా తిరుగుతాడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ సన్నిహితులు.
undefined
ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, గాయం నుంచి పూర్తిగా కోలుకొని కారణంగా మొదటి రెండు టెస్టులకు కూడా దూరమయ్యారు.
undefined
డిసెంబర్ 8న ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనున్న ఈ ఇద్దరూ... 14 రోజుల క్వారంటైన్‌లో గడిపిన తర్వాత మూడు, నాలుగో టెస్టులో బరిలో దిగబోతున్నారు.
undefined
click me!