టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది భారత క్రికెట్ బోర్డు. ఈ నిర్ణయంపై విరాట్, బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కేవలం టీ20 ఫార్మాట్ పగ్గాలు తీసుకోవడానికి రోహిత్ శర్మ ఒప్పుకోలేదని, వన్డే కెప్టెన్సీ కూడా కావాలని పట్టుబట్టాడని కూడా వార్తలు వచ్చాయి...