ఇదిలా వుండగా, రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ సూపర్ బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పంత్, శుభ్మన్ గిల్ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 287 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ను ఇక్కడి డిక్లేర్ చేయడంతో బంగ్లాదేశ్కు 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్. శుభ్మన్ గిల్ 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లి 17 పరుగుల వద్ద, యశస్వి జైస్వాల్ 10 పరుగుల వద్ద, రోహిత్ శర్మ 5 పరుగుల వద్ద ఔటయ్యారు. కేఎల్ రాహుల్ 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 149 పరుగులు చేసింది.
పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ చేతిలో ఔటయ్యాడు. అతని బౌలింగ్ లో టెస్టు క్రికెట్లో నాలుగోసారి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత వికెట్కీపర్గా ధోని రికార్డును పంత్ సమం చేశాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ గా ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశారు.