రిషబ్ పంత్ ఇండియా తరపున ఇప్పటివరకు 33 టెస్టులు ఆడాడు (ఇప్పుడు ఆడుతున్నది 34వ టెస్టు). 56 ఇన్నింగ్స్లలో 2271 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చెన్నైలో జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్టులో సెంచరీ చేసిన తర్వాత పంత్ పై క్రికెట్ వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
భారత లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని రికార్డును కూడా రిషబ్ పంత్ సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్లలో పంత్ 6 సెంచరీలు చేశాడు. ఎంఎస్ ధోని కూడా 6 సెంచరీలు చేశాడు.
పంత్ కు ప్రస్తుతం 34వ టెస్టు కాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఇన్ని మ్యాచ్ ల గణాంకాలు పోలిస్తే.. పంత్ 2,419 పరుగులు చేయగా, ఆసీస్ లెజెండ్ 2,282 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ ఆరు టెస్టు సెంచరీలు సాధించగా, గిల్ క్రిస్ట్ 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. పంత్ కూడా 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, రిషబ్ పంత్ (44.80) కంటే గిల్ క్రిస్ట్ మెరుగైన సగటు (58.51) కలిగి ఉన్నాడు.