ఢిల్లీ టెస్టుకు చాలా టైమ్ ఉన్నందున ఆసీస్ ఆటగాళ్లు ఇక్కడే ప్రాక్టీస్ చేయాలని భావించారట. అందుకు నాగ్పూర్ పిచ్ లోనే ప్రాక్టీస్ చేసుకుంటామని, ప్రధాన పిచ్ పై నీళ్లు పట్టొద్దంటూ పిచ్ క్యూరేటర్ ను ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోరిందని సమాచారం. అయితే ఇందుకు సదరు క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా శనివారం రాత్రి పిచ్ మీద నీళ్లు పట్టారంట. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసే వీలులేకుండా పోయిందని ఫాక్స్ క్రికెట్ లో ఓ కథనం వచ్చింది.