గత నెల ముంబై వేదికగా ముగిసిన బీసీసీఐ ఏజీఎంలో ఉమెన్స్ ఐపీఎల్ గురించిన చర్చ జరిగింది. లీగ్ నిర్వహణ, ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలానికి సంబంధించిన విషయాలు ఇందులో చర్చలోకి వచ్చాయి. దీనిపై ఐపీఎల్ కొత్త పాలకమండలి ఏర్పాటయ్యాక పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.