ధోనీ కోసమే ఆ పని చేశాను... మాహీతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన రణ్‌వీర్ సింగ్...

First Published Jul 26, 2021, 5:38 PM IST

సచిన్ టెండూల్కర్ తర్వాత మాస్‌లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్న మాహీ, తాజాగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు...

ఓ స్వచ్ఛంద సేవా కార్యక్రమం కోసం జరిగిన ఈ ఎగ్జిబిషన్ఫుట్‌బాల్ మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. ధోనీ ఎప్పుడూ తన ఫేవరెట్ స్టార్ అంటూ తెలియచేశాడు...
undefined
హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఓ యాడ్‌కి అసిస్టెండ్ డైరెక్టర్‌గా పనిచేశాడు రణ్‌వీర్ సింగ్. ‘అప్పుడు నాకు 22 ఏళ్లు ఉంటాయి. ఓ యాడ్‌లో ఎమ్మెస్ ధోనీ నటిస్తున్నారని తెలిసి, నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. కేవలం మాహీ కోసం నేను ఆ పని చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్.
undefined
‘ఎమ్మెస్‌డీ ప్రపంచంలోనే అతిగొప్ప స్పోర్ట్స్ పర్సన్. ఆయన ఆడుతున్నప్పుడు నేను పుట్టడం నా అదృష్టం. అతనో అద్భుతం. ఓ స్పోర్ట్ ఐకాన్... ఎప్పటికీ ఆయనే నా హీరో...
undefined
నా దేశానికి ఎంతో వెలుగు తీసుకొచ్చిన మాహీ భాయ్‌కి థ్యాంక్యూ...’ అంటూ మాహీ రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రణ్‌వీర్ సింగ్...
undefined
ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో కపిల్‌దేవ్ బయోపిక్ ‘83లో నటిస్తున్న రణ్‌వీర్ సింగ్, ‘ఎప్పుడూ అన్నయ్య పాదాల చెంతనే ఉంటాను’ అంటూ మాహీ కాళ్ల దగ్గర కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు..
undefined
క్రికెట్ కంటే ముందు ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్‌ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను అలరించాడు...
undefined
click me!