టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించిన అజిత్ అగార్కర్, అజయ్ జడేజా... ధావన్‌కి నిరాశే...

First Published Jul 26, 2021, 4:45 PM IST

అక్టోబర్‌లో ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌కి ముందు భారత జట్టు ఆడుతున్న టీ20 సిరీస్ శ్రీలంకతో జరుగుతోంది. టీ20 వరల్డ్‌కప్‌కి భారత జట్టును ఎంపిక చేసేందుకు ట్రయల్స్‌గా భావిస్తున్న లంక టీ20 సిరీస్ ఆరంభం కాగానే భారత మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, అజయ్ జడేజా తమ జట్లను ప్రకటించారు.

శ్రీలంక టూర్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండదని భావించిన అజిత్ అగార్కర్, అజయ్ జడేజా... ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లకు అవకాశం ఇచ్చారు.
undefined
ఆరంగ్రేటం టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయినప్పటికీ పృథ్వీషా దూకుడైన బ్యాటింగ్ కారణంగా అతనికి టీ20 వరల్డ్‌కప్‌లో చోటు కల్పించారు అగార్కర్, జడేజా...
undefined
విరాట్ కోహ్లీని వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్న అజిత్ అగార్కర్, టూ డౌన్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు కల్పించారు...
undefined
వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్‌తో పాటు రిషబ్ పంత్‌కి చోటు కల్పించిన ఈ ఇద్దరూ, ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఉంటుందని అంచనా వేశారు..
undefined
భారత స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలకు టీ20 వరల్డ్‌కప్‌లో చోటు ఉంటుందని భావించిన అగార్కర్, జడేజా... మూడో పేసర్‌గా భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహార్‌లకు అవకాశం దక్కొచ్చని అంచనా వేశారు.
undefined
ప్రధాన స్పిన్నర్‌గా యజ్వేంద్ర చాహాల్‌ను ఎంపిక చేసిన అజిత్ అగార్కర్, అజయ్ జడేజా... కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కకపోవచ్చని అతని స్థానంలో రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తిలకు చోటు దక్కొచ్చని భావించారు...
undefined
టీ20 వరల్డ్‌కప్‌కి అజిత్ అగార్కర్, అజయ్ జడేజా ప్రకటించిన భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, పృథ్వీషా, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్, రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తి
undefined
click me!