పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలతో 2021 లో పీసీబీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రమీజ్ రాజాపై నాటి నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాక్ మాజీ క్రికెటర్లు అతడి వ్యవహార శైలిపై వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అదీగాక రమీజ్ హయాంలో పాకిస్తాన్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో అత్యంత దారుణంగా ఓడి సిరీస్ లను కోల్పోయింది.