తండ్రి సర్దార్ కోరుకున్నట్టు, క్రికెటర్గా కొనసాగమని, అవసరమైతే తాము కుటుంబ ఖర్చులను భరిస్తామని భరోసా ఇచ్చారు. అలా క్రికెట్పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు భజ్జీ. 2001 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అనిల్ కుంబ్లే గాయపడడంతో భారత జట్టులోకి తిరిగి వచ్చిన హర్భజన్ సింగ్, టీమిండియాకి ప్రధాన స్పిన్నర్గా మారిపోయాడు..