ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ తరుపున ఆడి, లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సెంచరీ చేసిన రజత్ పటిదార్, రంజీ ట్రోఫీలోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. 6 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్ల్లో కలిపి 82.25 సగటుతో 658 పరుగులు చేసిన రజత్ పటిదార్, 100 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు...