ఇంగ్లాండ్ టూర్ 2021లోనూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు, ఆతిథ్య జట్టుపై తిరుగులేని ఆధిపత్యం చూపించింది. ఒక్క లీడ్స్ టెస్టు ఓటమి మినహా మిగిలిన మూడు టెస్టుల్లోనూ టీమిండియా ఆధిపత్యమే సాగింది. నాటింగ్హమ్లో జరిగిన తొలి టెస్టులో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు, లార్డ్స్ మైదానంలో చారిత్రక విజయాన్ని అందుకుంది..