
Rajasthan Royals unveils new jersey for IPL 2025: ప్రతి సంవత్సరం భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ కు రంగం సిద్ధమవుతోంది. ప్రతి మ్యాచ్ లో ఫోర్లు సిక్సర్ల వర్షం, అద్భుతమైన బౌలింగ్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ 2025 మార్చి 21న ప్రారంభం కానుండగా, ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
ఐపీఎల్ 2025 కోసం ప్రతి జట్టు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు తొలి ఛాంపియన్షిప్ను గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ 2025 ఐపీఎల్ కోసం తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. రాజస్థాన్ సాంప్రదాయ పింక్, నీలం రంగులలో కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, కుమార్ సంగక్కర రాజస్థాన్ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఆ జట్టు ఎక్స్ ప్లాట్ఫారమ్లో విడుదల చేసింది. కొత్త జెర్సీలో రాజస్థాన్ తరపున ఆడిన షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్, రవి అశ్విన్, జోస్ బట్లర్ వంటి ప్రముఖ క్రికెటర్లను ఆ జట్టు గౌరవించింది.
రాజస్థాన్ జట్టు తరపున ఆడిన షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్, యుజ్వేంద్ర చాహల్, గ్రేమ్ స్మిత్, స్టీవ్ స్మిత్, అజింక్యా రహానే, జోస్ బట్లర్, షేన్ వాట్సన్, ట్రెంట్ బౌల్ట్, బ్రాడ్ హాడ్జ్ వంటి వారు ధరించిన జెర్సీలను ప్రదర్శించి గౌరవించింది. అలాగే, అభిమానులు, క్రికెట్ లవర్స్ కోసం కొత్త జెర్సీని రాజస్థాన్ తమ వెబ్సైట్లో అమ్మకానికి ఉంచింది.
ద్రవిడ్ నుండి బుమ్రా వరకు... టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన భారత ప్లేయర్లు వీరే
ఐపీఎల్ 2025 కోసం రాజస్థాన్ రాయల్స్ టీమ్
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, శిమ్రాన్ హెట్మెయర్, సందీప్ శర్మలను రిటైన్ చేసుకుంది. జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, వనిందు హసరంగ, తుషార్ దేశ్పాండే, ఫజల్హక్ ఫరూఖీలను కొత్తగా వేలంలో కొనుగోలు చేసింది.
రాజస్థాన్ 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్లో ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఆ తర్వాత మంచి ప్రదర్శన కనబరచలేదు. శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ 2022 సీజన్లో ఫైనల్కు చేరుకుని ఓడిపోయింది. 2024లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. అయితే, 2008 తర్వాత ఆ జట్టు కప్పును గెలుచుకోలేకపోయింది.
అయితే, 2025 ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటాలని చూస్తోంది. ఎలాగైనా ఈ సారి ఛాంపియన్ గా నిలవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టును బలోపేతం చేసేందుకు భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఆ జట్టులోకి తీసుకున్నారు. ప్రధాన కోచ్ కుమార్ సంగక్కర, విక్రమ్ రాథోడ్లతో కలిసి రాజస్థాన్ను మళ్లీ ఛాంపియన్గా నిలపడానికి ద్రవిడ్ సిద్ధంగా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ మార్చి 21న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్లో మొదటి మ్యాచ్ ఆడనుంది. టోర్నీ ఫైనల్ కూడా ఇదే వేదికపై జరగనుంది. అయితే తదుపరి సీజన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ఇంకా విడుదల చేయలేదు.
ఐపీఎల్ 2025 కోసం రాజస్థాన్ టీమ్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నవదీప్ సైనీ, తనీష్ కొటియన్, సందీప్ శర్మ, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, ధృవ్ సేన్, ధృవ్ సేన్ కునాల్ సింగ్ రాథోడ్, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్