చెన్నైలో వర్షం... సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌కి అంతరాయం!...

First Published Apr 14, 2021, 5:48 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే చెన్నైలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఈ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి...

మండు వేసవిలో ఉపశమనంలా పలకరించిన వరుణుడు, హైదరాబాద్‌తో పాటు చెన్నై నగరాలను తడిసి ముంచేశాడు. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది...
undefined
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం చెన్నైలో మరో రెండు రోజుల పాటు చిరుజల్లులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్‌ సజావుగా నడుస్తుందా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి...
undefined
చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది...
undefined
కరోనా కారణంగా ఎన్నడూ లేనట్టుగా వర్షాకాలంలో జరిగిన 2020 సీజన్‌, యూఏఈ వేదికగా జరగడంతో అక్కడ ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదు. ఏకంగా నాలుగు సూపర్ ఓవర్ మ్యాచులు కూడా చూసే అవకాశం దక్కింది...
undefined
షెడ్యూల్ ప్రకారం వేసవిలోనే ఐపీఎల్ 2021 సీజన్‌ను ప్రారంభించినా అనుకోని చుట్టంలా వచ్చిన వరుణుడు, క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్న క్రికెట్ సీజన్‌కి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
undefined
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరుజట్లకి చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే ముంబైపై విజయంతో రెండు పాయింట్లు సాధించిన ఆర్‌సీబీ, మరోపాయింట్ చేరితే టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్తుంది...
undefined
click me!