పేరు మారింది, జెర్సీ మారింది, అయినా గుండెపోటు ఆగడం లేదు... ప్రీతి జింటా కామెంట్...

First Published Apr 13, 2021, 5:07 PM IST

కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీలో గత సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది పంజాబ్ కింగ్స్.... అయితే ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది. గత సీజన్‌లో పంజాబ్ ఆడిన దాదాపు అన్ని మ్యాచులు ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరింతంగా సాగాయి. ఈసారి కూడా మొదటి మ్యాచ్‌లోనే చివరి బంతి వరకూ ఉత్కంఠ సాగింది...

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్ ఆడిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో సూపర్ ఓవర్ మ్యాచు ఆడింది. పంజాబ్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు...
undefined
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది రాజస్థాన్ రాయల్స్. ఈ సారి కూడా ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం అందుకుంది పంజాబ్ కింగ్స్...
undefined
ఈ మ్యాచ్ అనంతరం స్పందించిన పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా... ‘యా... వాట్ ఏ గేమ్! మా జట్టుకి కొత్త పేరు వచ్చింది, కొత్త జెర్సీ వచ్చింది... కానీ ఇప్పటి సడ్డా పంజాబ్ గేమ్‌లో హార్ట్ అటాక్స్ ఇవ్వడం మాత్రం మారలేదు...
undefined
ఏం చేయగలం... మాకు పర్ఫెక్ట్ గేమ్ కాదు, కానీ ఆఖర్లో పర్ఫెక్ట్ ఫినిషింగ్ లభించింది. కెఎల్ రాహుల్, దీపక్ హుడా అండ్ పంజాబ్ కింగ్స్ జట్టు బాయ్స్ అందరూ అదరగొట్టారు.’ అంటూ ట్వీట్ చేసింది ప్రీతి జింటా...
undefined
‘సంజూ శాంసన్ స్పెషల్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే... ఈ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది...’ అంటూ మరో ట్వీట్ చేసింది సొట్టబుగ్గల సుందరి...
undefined
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 119 పరుగులతో అదరగొట్టగా... మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌కి కెఎల్ రాముల్ 91 పరుగులతో, దీపక్ హుడా 64 పరుగులతో రాణించి, భారీ స్కోరు అందించారు...
undefined
click me!