ప్రీతి జింటా మాస్టర్ ప్లాన్... ఆర్‌సీబీ పర్సు ఖాళీ చేయించిన పంజాబ్ కింగ్స్ ఓనర్...

First Published Feb 19, 2021, 10:28 AM IST

ఐపీఎల్ మినీ వేలం 2021 మొదలు కాకముందు పంజాబ్ కింగ్స్ పర్సులో ఏకంగా రూ.53 కోట్లకు పైగా ఉన్నాయి. దీంతో వేలంలో ప్రీతి జింటా షాపింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని భావించారంతా. అనుకున్నట్టుగానే ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏకంగా నలుగురు ప్లేయర్లు రూ.14 కోట్ల మార్కును దాటారు. అయితే ఆశ్చర్యంగా పంజాబ్ కింగ్స్ ఖాతాలో బోలెడు డబ్బు మిగలగా, ఆర్‌సీబీ పర్సు ఖాళీ అయ్యింది.

ఐపీఎల్ 2021 మినీ వేలంలో రూ.34 కోట్ల 40 లక్షలను ఖర్చు చేసిన పంజాబ్ కింగ్స్, 9 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. మిగిలిన జట్లతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ ఈ వేలంలో చాలా స్మార్ట్‌గా, మాస్టర్ ప్లాన్‌తో వ్యవహారించింది...
undefined
నెం.1 టీ20 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్‌ను బేస్ ప్రైజ్‌ రూ. కోటిన్నరకే కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. వేలానికి ముందు మలాన్ కోసం ఫ్రాంఛైజీల మధ్య బీభత్సమైన పోటీ తప్పదని భావించినా, స్టార్ హిట్టర్ కోసం మిగిలిన జట్లు ఆసక్తి చూపించలేదు...
undefined
బిగ్‌బాష్ లీగ్ సీజన్ 10లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జే రిచర్డ్‌సన్‌ను రూ.14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అతనితో పాటు ఆసీస్ యంగ్ ప్లేయర్ రిలే మెరేడిత్‌ను రూ.8 కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్...
undefined
తమిళనాడు బ్యాటింగ్ సెన్సేషన్ షారుక్ ఖాన్‌ కోసం తీవ్రంగా పోటీపడిన పంజాబ్ కింగ్స్, అతనికి ఏకంగా రూ.5 కోట్ల 25 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది. మొయిసిస్ హెండ్రిస్‌ను రూ.4 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
undefined
వీరితో పాటు జలజ్ సక్సేసా రూ.30 లక్షలు, ఉత్కర్ష్ సింగ్ రూ.20 లక్షలు, సౌరబ్ కుమార్ రూ.20 లక్షలు, విండీస్ బ్యాటింగ్ సెన్సేషన్ ఫ్యాబియన్ ఆలెన్‌ రూ.75 లక్షల బేస్ ‌ప్రైజ్‌కే దక్కించుకుంది పంజాబ్ కింగ్స్...
undefined
అయితే వేలంలో 9 మంది ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ పంజాబ్ కింగ్స్ పర్సులో రూ.18.80 కోట్లు మిగిలి ఉండడం విశేషం. పంజాబ్ కింగ్స్ యజమాని ప్రతీ జింటా మిగిలిన జట్ల ముఖ్యంగా ఆర్‌సీబీ పర్సు ఖాళీ చేయాలనే మాస్టర్ ప్లాన్‌తో వచ్చినట్టు కనిపించింది.
undefined
న్యూజిలాండ్ ప్లేయర్ కేల్ జెమ్మీసన్‌ కోసం పోటీపడిన పంజాబ్ కింగ్స్‌, ఆర్‌సీబీ అతని కోసం రూ.15 కోట్ల భారీ మొత్తం చెల్లించేలా చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ న్యూజిలాండ్ ప్లేయర్‌కి ఇంత భారీ మొత్తం దక్కడం ఇదే తొలిసారి.
undefined
అంతేకాకుండా ఈ ఏడాది మినీ వేలానికి మ్యాక్స్‌వెల్‌ను విడుదల చేసిన పంజాబ్ కింగ్స్, వేలంలో మళ్లీ అతని కోసం పోటీపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాక్స్‌వెల్‌ను ఎంతకైనా కొనుగోలు చేయాలని ఆర్‌సీబీ డిసైడ్ అయినట్టు వార్తలు రావడంతో దానికి తగ్గట్టుగా అతని ధర పెంచుతూ పోయింది పంజాబ్ కింగ్స్.
undefined
ఐపీఎల్ ఆటతీరులాగే వేలంలో కూడా ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా వచ్చినట్టు కనిపించిన ఆర్‌సీబీ, వేలంలో 8 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. వీరి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.35.05 కోట్లు. ఫలితంగా ఆర్‌సీబీ పర్సులో కేవలం రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి.
undefined
పంజాబ్ కింగ్స్ పర్సులో భారీ మొత్తం మిగిలి, వారికి కావాల్సిన 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ పర్సు మొత్తం ఖాళీ అయిపోయినా మొత్తంగా 22 మందిని మాత్రమే కొనుగోలు చేయగలిగింది.
undefined
click me!