కానీ సరిహద్దు వివాదాలు, భద్రతా సమస్యల కారణంగా.. పాకిస్తాన్ లో ఈ టోర్నీని నిర్వహిస్తే తాము పాల్గొనబోమని, తటస్థ వేదిక అయితేనే తాము ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జై షా గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జై షా వ్యాఖ్యలకు పాక్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఆసియా కప్ ఆడటానికి పాకిస్తాన్ కు రాకుంటే 2023లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు తాము ఇండియాకు వెళ్లమని తెలిపింది.