IPL 2025లో అభిమానులకు ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్ల ఉత్సాహాన్ని చూశారు. కానీ, పంజాబ్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన తక్కువ స్కోరింగ్ మ్యాచ్లో వికెట్లు పడుతుంటే ట్రిపుల్ డోస్ ఉత్సాహం కనిపించింది. ఓడిపోవడం పక్కా అనుకున్న తక్కువ టోటల్ ను ఢిఫెండ్ చేసుకుని పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ విజయంతో పంజాబ్ జట్టు చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాట్స్మెన్పై ఆకలితో ఉన్న సింహాల మాదిరిగా కేకేఆర్ బౌలర్లు విరుచుకుపడ్డారు. దీంతో పంజాబ్ టీమ్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ 30, ప్రియాంశ్ ఆర్య 22, శశాంక్ సింగ్ 18 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.