ఐసీసీ టోర్నమెంట్.. ఒక్క గెలుపు లేదు.. పాక్ ఇజ్జత్ పాయే
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. తన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ కరాచీలో న్యూజిలాండ్తో తలపడింది. తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీని తర్వాత తన రెండో మ్యాచ్ ను భారత్ ఆడింది. ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుగా ఓడింది.
వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత, పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్స్కు దూరమైంది. న్యూజిలాండ్పై బంగ్లాదేశ్ విజయం చివరి ఆశగా ఉంది, కానీ ఈ పాక్ అనుకున్నది జరగలేదు. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండూ సెమీస్ రేసు నుంచి ఔట్ అయ్యాయి.
ఇక ఈ రెండు జట్లు గ్రూప్ దశలో విజయంతో టోర్నీ నుంచి బయటకు రావాలని చూశాయి. అయితే, రావల్పిండిలో భారీ వర్షం కారణంగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయింది. విజయంతో వీడ్కోలు పలకాలనే పాకిస్తాన్ కల కూడా చెదిరిపోయింది.