బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై పాకిస్తాన్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఆసియా కప్ - 2023 లో అధికారిక ఆతిథ్య హక్కులు తమకే ఉన్నా బీసీసీఐ చక్రం తిప్పడంతో ఈ టోర్నీలో పాకిస్తాన్ కు నాలుగు మ్యాచ్ లు మాత్రమే దక్కాయి. ఇవి కూడా నేపాల్, భూటాన్ వంటి జట్లతో... టోర్నీలో అత్యంత కీలకమైన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు ఫైనల్ (మొత్తంగా 9) మ్యాచ్ కూడా శ్రీలంకకే దక్కింది.