ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో పేరుగాంచిన కరాచీ, ముల్తాన్, రావల్పిండి, పెషావర్ లలోని ప్రముఖ స్టేడియాలన్నీ మూగబోయాయి. తమ దేశానికి క్రికెట్ ఆడే దేశాలు రాకపోవడంతో అక్కడ మైదానాలన్నీ ప్రేక్షకులు లేక వెలవెల్లాడాయి. బోర్డు కూడా పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.