వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించింది. అయితే ఆసీస్ లో ఎవరు ఓపెనింగ్ చేయాలి..? రోహిత్ శర్మ భాగస్వామిగా ఫామ్ లో లేని కెఎల్ రాహుల్ స్థానంలో కోహ్లీని ఆడించాలా..? లేదంటే రిషభ్ పంత్ ను తీసుకొచ్చి కుడి, ఎడమ చేతి వాటం బ్యాటర్లను ఆడిస్తే బాగుంటుందా..? అని చర్చలు జరుగుతున్నాయి.