2019 వన్డే వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2020 సీజన్ తర్వాత ఐపీఎల్ కూడా ఆడడేమోనని ప్రచారం జరిగినా, వాటిని కొట్టిపారేసిన మాహీ... ఐపీఎల్ మినహా మరో లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు.