16 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన మహేంద్ర సింగ్ ధోనీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు..
undefined
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత క్రికెట్కి దూరంగా ఉంటూ... సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోనీ... దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.
undefined
ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్కి దూరంగా ఉన్న యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లాంటి వాళ్లు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటే... ధోనీ మాత్రం ఐపీఎల్ ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
undefined
ధోనీ గైర్హజరీతో సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకి ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు... ముంబై ఇండియన్స్కి ఆడే ఇషాన్ కిషన్ జన్మస్థలం జార్ఖండ్.
undefined
విరాట్ సింగ్ జార్ఖండ్ జట్టుకి వైస్ కెప్టెన్గా వ్యవహారిస్తుంటే తన జట్టులో షాబద్ నదీమ్, సౌరవ్ తివారి, అనుకుల్ రాయ్, వరుణ్ అరోణ్, మోను కుమార్ సింగ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.
undefined
ధోనీతో పాటే రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా... సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ జట్టుకి రైనా కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు.
undefined
జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ 2021 కోసం ఆరు నగరాలను వేదికలుగా ఎంచుకుంది బీసీసీఐ. బయో బబుల్ సెక్యులర్ జోన్లో జరిగే ఈ టోర్నీ జనవరి 31న ముగుస్తుంది.
undefined
అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్... సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
undefined
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్లబ్యాన్ అనుభవించిన వివాదాస్పద క్రికెటర్శ్రీశాంత్ కూడాసయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు...
undefined