‘హర్యానాతో మ్యాచ్ లో సెంచరీ చేయడం నాకు సవాల్ గా అనిపించింది. ఆ జట్టుకు పటిష్ట బౌలింగ్ యూనిట్ ఉంది. 40వ ఓవర్లో కూడా బంతిని స్వింగ్ చేసే బౌలర్లు ఆ జట్టుకు ఉన్నారు. అందుకే ఆ సెంచరీ నాకు పేవరేట్..’ అని చెప్పాడు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో జగదీశన్ ను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకున్న విషయం తెలిసిందే. అయితే అది తనకు సంబంధం లేని విషయమని, తన కంట్రోల్ లో లేని విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పాడు. తనకు తెలిసింది బ్యాటింగ్ మాత్రమేనని వివరించాడు.