
మొదటి టెస్టులో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, రెండో టెస్టులో మార్పులు చేయాలని చూస్తోంది. ఆఖరి నిమిషంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న షాబజ్ నదీం, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. జో రూట్ వికెట్తో పాటు టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీసినా, అనుకున్నంతగా రాణించలేదు.
మొదటి టెస్టులో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, రెండో టెస్టులో మార్పులు చేయాలని చూస్తోంది. ఆఖరి నిమిషంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న షాబజ్ నదీం, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. జో రూట్ వికెట్తో పాటు టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీసినా, అనుకున్నంతగా రాణించలేదు.
తొలి ఇన్నింగ్స్లో షాబజ్ నదీం, వాషింగ్టన్ సుందర్లలో ఎవ్వరూ స్పిన్ బౌలింగ్లో రాణించినా ప్రత్యర్థి జట్టుకి అంతటి భారీ స్కోరు దక్కేది కాదు. అక్షర్ పటేల్ గాయంతో తప్పుకోవడంతో కుల్దీప్ యాదవ్ను పక్కనబెట్టి షాబజ్ నదీంకు అవకాశం ఇచ్చాడు కోహ్లీ. కానీ రెండు ఇన్నింగ్స్ల్లో డకౌట్ అయిన నదీం, బౌలింగ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది లేదు.
తొలి ఇన్నింగ్స్లో షాబజ్ నదీం, వాషింగ్టన్ సుందర్లలో ఎవ్వరూ స్పిన్ బౌలింగ్లో రాణించినా ప్రత్యర్థి జట్టుకి అంతటి భారీ స్కోరు దక్కేది కాదు. అక్షర్ పటేల్ గాయంతో తప్పుకోవడంతో కుల్దీప్ యాదవ్ను పక్కనబెట్టి షాబజ్ నదీంకు అవకాశం ఇచ్చాడు కోహ్లీ. కానీ రెండు ఇన్నింగ్స్ల్లో డకౌట్ అయిన నదీం, బౌలింగ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది లేదు.
రెండో టెస్టులో షాబజ్ నదీం స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారని భావించారంతా. ఆడిన గత రెండు మ్యాచుల్లోనూ ఐదేసి వికెట్లతో రాణించిన కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మ్యాజిక్తో, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పట్టగలడని విశ్లేషించారు క్రికెట్ పండితులు. కానీ టీమిండియా ఆలోచన మాత్రం వేరేగా ఉంది.
రెండో టెస్టులో షాబజ్ నదీం స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారని భావించారంతా. ఆడిన గత రెండు మ్యాచుల్లోనూ ఐదేసి వికెట్లతో రాణించిన కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మ్యాజిక్తో, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పట్టగలడని విశ్లేషించారు క్రికెట్ పండితులు. కానీ టీమిండియా ఆలోచన మాత్రం వేరేగా ఉంది.
చెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో అక్షర్ పటేల్ లేదా రాహుల్ చాహార్ను ఆడించాలని భావిస్తోందట బీసీసీఐ. గాయంతో తొలి టెస్టులో బరిలో దిగని అక్షర్ పటేల్, రెండో టెస్టు ఆరంభానికి ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. దీంతో అతను తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా...
చెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో అక్షర్ పటేల్ లేదా రాహుల్ చాహార్ను ఆడించాలని భావిస్తోందట బీసీసీఐ. గాయంతో తొలి టెస్టులో బరిలో దిగని అక్షర్ పటేల్, రెండో టెస్టు ఆరంభానికి ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. దీంతో అతను తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా...
అక్షర్ పటేల్ అందుబాటులో లేకపోతే రాహుల్ చాహార్ను దింపే అవకాశం కనబడుతోంది. ‘ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’ అంటూ భారత బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్లతో చర్చిస్తున్న ఫోటోలను పోస్టు చేశాడు రాహుల్ చాహార్. రెండో టెస్టు ముందు చాహార్ కూడా ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడంటే కుల్దీప్ యాదవ్కి జట్టులో చోటు లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్షర్ పటేల్ అందుబాటులో లేకపోతే రాహుల్ చాహార్ను దింపే అవకాశం కనబడుతోంది. ‘ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’ అంటూ భారత బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్లతో చర్చిస్తున్న ఫోటోలను పోస్టు చేశాడు రాహుల్ చాహార్. రెండో టెస్టు ముందు చాహార్ కూడా ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడంటే కుల్దీప్ యాదవ్కి జట్టులో చోటు లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2018 తర్వాత మళ్లీ మూడేళ్లకి రెండో టెస్టు ఆడిన షాబజ్ నదీం, ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 44 ఓవర్లు బౌలింగ్ చేసి 167 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లలోనే 66 పరుగలిచ్చాడు నదీం.
2018 తర్వాత మళ్లీ మూడేళ్లకి రెండో టెస్టు ఆడిన షాబజ్ నదీం, ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 44 ఓవర్లు బౌలింగ్ చేసి 167 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లలోనే 66 పరుగలిచ్చాడు నదీం.
తొలి టెస్టులో బుమ్రా, ఇషాంత్ శర్మ కూడా స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆస్ట్రేలియా టూర్లో 13 వికెట్లు తీసిన సిరాజ్ను పక్కనబెట్టి, ఇషాంత్ శర్మకు అవకాశం ఎందుకిచ్చారని విమర్శలు వచ్చాయి. అయితే తొలి ఇన్నింగ్స్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్, రెండో ఇన్నింగ్స్లో వికెట్ తీసి 300 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. కాబట్టి సిరాజ్కి చోటు దక్కడం అనుమానమే అని తెలుస్తోంది.
తొలి టెస్టులో బుమ్రా, ఇషాంత్ శర్మ కూడా స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆస్ట్రేలియా టూర్లో 13 వికెట్లు తీసిన సిరాజ్ను పక్కనబెట్టి, ఇషాంత్ శర్మకు అవకాశం ఎందుకిచ్చారని విమర్శలు వచ్చాయి. అయితే తొలి ఇన్నింగ్స్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్, రెండో ఇన్నింగ్స్లో వికెట్ తీసి 300 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. కాబట్టి సిరాజ్కి చోటు దక్కడం అనుమానమే అని తెలుస్తోంది.