అప్పటికే ఉన్న ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ను విస్తరించడంలో సంజీవ్ ది కీలక పాత్ర. రాంప్రసాద్ గొయెంకాకు ఇద్దరు కొడుకులు. సంజీవ్ తో పాటు హర్ష్ గొయెంకా. హర్ష్ గొయెంకా ఆర్పీజీ గ్రూప్ చూసుకుంటుండగా.. సంజీవ్ కొత్త వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పవర్, ఇంజినీరింగ్, విద్య, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఐటీ, రిటైల్, ఎఫ్ఎంసీజీ, ప్లాంటేషన్స్, ఫుడ్ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఆర్పీఎస్జీ గ్రూప్ కింద 23 కంపెనీలను నడుపుతున్నారు.