భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సారథుల్లో మొదటివరుసలో ఉండే నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. మరెవరకీ సాధ్యం కాని రీతిలో రెండు ప్రపంచకప్పులు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, మరెన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ధోని.. చదువులో మాత్రం అంత మెరుగైన విద్యార్థి కాదట.