కరోనా బాధితుల కోసం ఇంటినే అమ్మేసిన మహేంద్ర సింగ్ ధోనీ... సోషల్ మీడియాలో తెగ వైరల్...

First Published May 7, 2021, 4:56 PM IST

సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎలా పుడతాయో, ఎందుకు పుడతాయో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి ఓ వార్తే మహేంద్ర సింగ్ ధోనీ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా బాధితుల సహాయార్థం మాజీ సారథి ధోనీ చేసిన పని ఇదంటూ మోత మోగిస్తున్నారు కొందరు వాట్సాప్ బ్యాచ్ మొనగాళ్లు.

మహేంద్ర సింగ్ ధోనీ కరోనా బాధితుల సహాయార్థం... తన క్రికెట్ కెరీర్‌లో సంపాదించిన ఆస్తి మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశాడని... ఆఖరికి రాంఛీలో ఉన్న తన విలాసవంతమైన ఇంటికి కూడా అమ్మేశాడని ఈ వార్త సారాంశం...
undefined
అంతేకాదు కరోనాపై కలిసి కట్టుగా పోరాడాలని మహేంద్ర సింగ్ ధోనీ తీసుకున్న నిర్ణయం వల్ల, ఆయన కుటుంబం మొత్తం రోడ్డున పడిందని, మాహీ దగ్గర కేవలం లక్ష రూపాయలు మాత్రమే మిగిలాయని మోత మోగిస్తున్నారు కొందరు నెటిజన్లు...
undefined
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఈ రకమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోనీ కరోనా బాధితుల కోసం ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా ఆర్జించిన రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చాడంటూ ప్రచారం జరిగింది.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వచ్చిన రూ.15 కోట్లు ఎలా విడదీసి, విరాళాలు ఇచ్చాడో కూడా కొన్ని వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు తన యావదాస్తిని కరోనా సహాయార్థం రాసి ఇచ్చాడంటూ... ఆ విలువ దాదాపు రూ.1500 కోట్లు అంటూ పుకారు లేచింది.
undefined
ధోనీతో పాటు అతని స్నేహితుడు, సీఎస్‌కే ప్లేయర్ సురేశ్ రైనా రూ.500 కోట్లు ఇచ్చాడని... విరాట్ కోహ్లీ కూడా మరో వెయ్యి కోట్లు ఇచ్చేందుకు రెఢీ అయ్యాడంటూ వీరలెవెల్లో వాట్సాప్ సందేశాలు వైరల్ అవుతున్నాయి...
undefined
వాస్తవానికి గత ఏడాది కరోనా నియంత్రణ కోసం రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... నేడు మరో రూ.2 కోట్లు కరోనా బాధితుల సహాయర్థం ఇస్తున్నట్టు ప్రకటించారు.
undefined
భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటిదాకా కరోనా బాధితుల సహాయార్థం ఎటువంటి విరాళం ప్రకటించలేదు. ఈ కారణంగానే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని అనుమానిస్తున్నారు విశ్లేషకులు...
undefined
కరోనాతో దేశం అల్లాడిపోతుంటే మాహీ సాయం చేయడం లేదని ట్రోల్ చేస్తూ పుట్టించిన వార్తలను నమ్మేసిన కొందరు మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమానులు... ఇదే నిజమంటూ తెగ వైరల్ చేసేస్తున్నారు...
undefined
కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రస్తుతం ఢిల్లీలోని హోటెల్‌లోనే ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, సీఎస్‌కే జట్టు నుంచి అందరు ప్లేయర్లు ఇంటికి చేరాకే తాను బయలుదేరతానని చెప్పినట్టు సమాచారం.
undefined
గత ఏడాది దారుణమైన ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఈ సీజన్‌లో అద్భుతంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ కోవిద్ విరాళాల పుకార్ల కారణంగా మరోసారి ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు.
undefined
click me!