ఈ విందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన దిగ్గజ ప్లేయర్లు ధోనీ, సురేష్ రైనా, సాక్షి ధోని ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో క్రికెట్ అభిమానలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి ధోనిలు ఇచ్చిన విందు తర్వాత.. సురేష్ రైనా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. 'ధోని భాయ్ గొప్ప విందుకు ధన్యవాదాలు' అని తెలిపాడు.