జట్టు ఎంపికపై టీమిండియా సారథి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అనుసరిస్తున్న తీరుపై విమర్శకులు మండిపడుతున్నారు. జట్టులో నాలుగో పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని, యూఏఈలోని పరిస్థితుల మీద అవగాహన ఉండి కూడా ఇలా చేయడమేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.