అభిషేక్, రింకూ సింగ్ లకు దక్కిన చోటు
జట్టులో అభిషేక్ శర్మకు చోటు దక్కింది. టీ20 ఇంటర్నేషనల్లో అతనికి మంచి ఆరంభం అందింది. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లు రాకపోవడంతో అతను జట్టు నుంచి ఔట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్లాడు. తన రెండో మ్యాచ్లో సెంచరీ చేసిన అభిషేక్.. వరుసగా ఏడు ఇన్నింగ్స్ల్లో 50 పరుగులకు చేరుకోలేకపోయాడు. అతను దక్షిణాఫ్రికాలో తన చివరి రెండు ఇన్నింగ్స్లలో 50, 36 పరుగులు చేశాడు.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) , రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.