అయితే, ధైర్యం కోల్పోని యువరాజ్ సింగ్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఇక్కడ అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రాకపోవడంతో యువరాజ్ సింగ్ను జట్టు నుంచి తప్పించారు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
అయితే, యువరాజ్ సింగ్ క్రికెట్ కు దూరం కావడానికి ధోని క్రికెట్ సర్కిల్ లో చాలా సార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, యూవీ క్రికెట్ కు దూరం కావడానికి ధోని కారణం కాదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. యూవీ క్రికెట్ జీవితం అనుకోకుండా మధ్యలోనే ముగియడానికి కారణం ధోనీ కాదు, విరాట్ కోహ్లీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.