ఈ నివేదికల ప్రకారం.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత బృందంతో షమీ దక్షిణాఫ్రికాకు వెళ్లే అవకాశం లేదు. రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. బీసీసీఐ అధికారికంగా షమీ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయాలు కూడా వెల్లడించలేదు. అయితే భారత వైట్-బాల్ స్క్వాడ్లో ఉన్న పేసర్లలో ఒకరు అతని స్థానంలో టెస్ట్ జట్టులో భర్తీ చేయగలరని భావిస్తున్నారు.