వన్డేల్లో 5 సార్లు 90+ స్కోర్లు చేసిన మిథాలీ రాజ్, వన్డేల్లో 155 మ్యాచులకు కెప్టెన్గా చేసి రికార్డులు క్రియేట్ చేసింది... ఆరు వన్డే ప్రపంచకప్ లలో ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది మిథాలీ. పురుషుల క్రికెట్ లో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ పేరిట ఉంది. సచిన్ తన కెరీర్ లో 1992, 1996, 1999, 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్ లలో భారత్ తరఫున ఆడాడు. మిథాలీ రాజ్ 2000, 2005, 2009, 2013, 2017, 2022 వన్డే వరల్డ్ కప్ లలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది.