ఈ మ్యాచ్ లో ద్విశతకం బాదడం ద్వారా ఇషాన్ మరో ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్, సచిన్, సెహ్వాగ్ లు భారత్ లోనే స్వదేశంలోనే ఈ ఘనత అందుకున్నారు. సచిన్ గ్వాలియర్ లో డబుల్ సెంచరీ చేయగా రోహిత్ (మొహాలీ, బెంగళూరు, ఈడెన్ గార్డెన్) లో సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఇండోర్ లో డబుల్ అందుకున్నాడు. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ లో ఈ ఘనత సాధించడం విశేషం.