ఐసీసీ టోర్నీలలో భారత్ పై చెత్త రికార్డు కలిగి ఉన్న పాకిస్తాన్.. గతేడాది మాత్రం తన రాతను మార్చుకుంది. దుబాయ్ లో ముగిసిన ఆ మ్యాచ్ లో టీమిండియాను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా గ్రూప్ స్టేజ్ లో భారత్.. సూపర్-4లో పాకిస్తాన్ గెలిచాయి.