పూలు అమ్మేందుకు వచ్చి రెక్కీ, ఆ తర్వాత ప్లాన్ ప్రకారం... రైనా మామను చంపిన గ్యాంగ్ లీడర్ అరెస్ట్...

First Published Jul 19, 2021, 12:52 PM IST

మాజీ భారత క్రికెటర్ సురేష్ రైనా మామ అశోక్ కుమార్ ఇంటిపై దాడి చేసి, అతన్ని హత్యచేసిన దోపిడీ దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

గత ఏడాది ఆగస్టు 20న అశోక్ కుమార్ ఇంటిపై దాడి చేసిన కొందరు దోపిడీ దొంగలు, అతనితో పాటు రైనా బావమరిది కౌషల్ కుమార్‌ను హత్యచేశారు. ఈ దాడితో అశోక్ కుమార్ భార్య ఆశా రాణి తీవ్రంగా గాయపడింది.
undefined
ఈ సంఘటనకు పాల్పడిన వారిని నెలరోజుల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, దీనికి పథకం పన్నిన మాస్టర్ మైండ్ ఛజ్జూ చైమర్‌ని దాదాపు ఏడాది తర్వాత అరెస్ట్ చేశారు...
undefined
ఛజ్జూ చైమర్ కోసం ఏడాది కాలంగా పంజాబ్, తదితర రాష్ట్రాల్లో గాలిస్తున్న పోలీసులు, ఎట్టకేలకు అతన్ని ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. రాత్రి సమయాల్లో దోపిడీ చేసే వాళ్లంతా పగటి పూట పండ్లు పూలు అమ్ముతూ రెక్కీ నిర్వహిస్తామని చెప్పడం విశేషం.
undefined
అశోక్ కుమార్ హత్యకు ముందు కూడా ఛజ్జూ చైమర్ గ్యాంగ్‌లోని ఓ మహిళ, పూలు అమ్మేందుకు వచ్చి రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
undefined
మొత్తంగా 11 మంది కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని, వారిలో ఛజ్జూ చైమర్‌తో పాటు షాపూర్ కడీ ఏరియాలో నివసించే సావన్, మొహబత్, రషీద్, షారుక్, నౌస్, అమీర్ అనే యువకులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నట్టు నిర్ధారించారు పోలీసులు.
undefined
ఈ హఠాత్ సంఘటనతో ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈలో శిక్షణ తీసుకుంటున్న సురేష్ రైనా, అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు.
undefined
రైనా లేకుండా ఐపీఎల్ 2020 సీజన్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారి ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది.
undefined
పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన సీఎస్‌కే పర్ఫామెన్స్ కారణంగా ధోనీ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ధోనీ కూతురు జీవా సింగ్‌పై కూడా అత్యాచార బెదిరింపులు రావడం, ఆ పనికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేయడం జరిగిపోయాయి.
undefined
click me!