జోధ్పూర్కు చెందిన బిష్ణోయ్.. భారత్ తరఫున 10 టీ20లు ఆడాడు. ఒక వన్డే మ్యాచ్ లో కూడా అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో లక్నో తరఫున ఆడిన బిష్ణోయ్ 16 వికెట్లు తీసి ఆ జట్టు ప్లేఆఫ్స్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. దేశవాళీలో రాణించి త్వరలో టీమిండియాకు ఎంపిక కావాలని ఆశిస్తున్న బిష్ణోయ్ ఈ మేరకు తనుక అవకాశాలివ్వని రాజస్తాన్ ను వదిలేసి గుజరాత్ తరఫున ఆడనున్నాడు. మరి ఇక్కడైనా అతడి ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుందేమో చూడాలి.