ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా, కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో సహనం కోల్పోయినట్టు కనిపించాడు. టీమ్ లోని ప్లేయర్లపై గ్రౌండ్ లో అరుస్తూ కనిపించాడు. అలాగే, లక్నో ఓటమికి కారణం అయ్యేలా మారింది పంత్ తీసుకున్న ఒక బిగ్ డిసెషన్. లక్నో టీమ్ కు మిచెల్ మార్ష్, మార్క్రామ్ లు అద్భతమైన ఆంరంభం అందించారు.
కానీ, మార్క్రామ్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రాకుండా అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్లను ముందుగా బ్యాటింగ్ కు పంపాడు. చివరి ఓవర్ లో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. దీంతో పంత్ పై విమర్శలు వస్తున్నాయి.