IPL 2025 RCB: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందిందా?

Mahesh RajamoniPublished : May 15, 2025 11:38 PM

IPL 2025 RCB: 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి జట్టు గురించి కీలకమైన వార్త బయటకు వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

16
IPL 2025 RCB: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందిందా?

IPL 2025 RCB:  భారత్-పాక్ యుద్ధ భయాల నేపథ్యంలో వారం రోజుల పాటు నిలిపివేయబడిన 18వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

26

మే 17న జరగనున్న తొలి మ్యాచ్‌లో గత ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది.
 

36

గాయం కారణంగా మునుపటి మ్యాచ్‌కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజల్‌వుడ్, ఐపీఎల్ నిలిపివేత తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న జోష్ హేజల్‌వుడ్ మళ్లీ ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు రావడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో ఆర్సీబీ అభిమానులు  ఆందోళన చెందారు.

46

ఆర్సీబీ తరపున అద్భుతంగా బౌలింగ్ చేసిన జోష్ హేజల్‌వుడ్, 10 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి ఆర్‌సిబి తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.
 

56

హేజల్‌వుడ్ గురించి కీలక అప్‌డేట్ వెలువడింది. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆసీస్ స్టార్  హేజల్‌వుడ్ త్వరలో ఆర్‌సిబి జట్టులో చేరనున్నారు. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడనున్నారు.

జోష్ భారత్‌కు వస్తున్నారు. హేజల్‌వుడ్ ఎప్పుడు భారత్‌కు వస్తారనే దానిపై అధికారులతో చర్చలు జరుగుతున్నాయని హేజల్‌వుడ్ సన్నిహితులు తెలిపారు.

66

జోష్ హేజల్‌వుడ్ జట్టులోకి వస్తే ఆర్‌సిబికి మరింత బలం చేకూరుతుంది. ఆర్‌సిబి లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. 

తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కలలు కంటున్న ఆర్సీబీకి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. టోర్నమెంట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తుందా అనేది చూడాలి.

Read more Photos on
click me!