భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు జోస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కు తోడుగా అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 170 పరుగులు జోడించి ఇంగ్లాండ్ ను ఫైనల్ కు చేర్చారు.