ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో కివీస్ నిర్దేశించిన 299 పరుగుల (74 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 136, 14 ఫోర్లు, 7 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 75 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) లు విధ్వంసకర ఆట ఆడి రెండో టెస్టులో ఇంగ్లాండ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.