ఇండియాతో ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో రూట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో రూట్.. 737 పరుగులు సాధించాడు. అంతేగాక రెండున్నరేండ్లుగా 11 సెంచరీలు చేసి కోహ్లి, స్మిత్ (27 సెంచరీలు) లను అధిగమించాడు. ఫ్యాబ్-4 ఆటగాళ్లుగా పిలవబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ లలో ఇప్పుడు రూట్ మిగతా ముగ్గురికంటే ముందున్నాడు.